నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ హయాంలో మైనింగ్ అక్రమాలు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మైనింగ్ యజమానులను బెదిరించి భారీగా వసూలు చేస్తున్నారని, ఈ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతోందని ఆరోపించారు. ‘ఫినీ క్వార్ట్జ్’ పేరుతో దాదాపు రూ.200 కోట్లు సమీకరించారని పేర్కొన్నారు. దేవాదాయ భూముల్లోనూ అక్రమ మైనింగ్
జరుగుతోందని ఆరోపిస్తూ, వేమిరెడ్డికి సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.

