కొందరు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, అలాంటి పాత్రలను తెరపైకి తెస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా జగన్కు మాత్రమే ఉందన్నారు. వైసీపీని విమర్శించే విషయంలో పాత్రలు మాత్రమే
మారుతున్నాయని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసీపీపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

